logo

నంద్యాల : టిడిపి ముస్లింల అత్మీయ సమావేశం సూపర్ సక్సెస్

నంద్యాల పట్టణంలోని ఫరూఖ్ నగర్ బిస్మిల్లా ప్లైవుడ్ అధ్వర్యంలో జరిగిన టిడిపి ముస్లింల అత్మీయ సమావేశం సూపర్ సక్సెస్ అయింది.సమావేశంకు నియోజకవర్గంలోని ప్రముఖ ముస్లిం నాయకులతో పాటు భారీగా ముస్లింలు పాల్గొన్నారు.ముఖ్య అతిధులుగా టీడిపి ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి,ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్,మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి,ఎవి సుబ్బారెడ్డి, డాక్టర్ బాబన్,తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి,ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూఖ్ మాట్లడుతూ సిఎం జగన్ ముస్లింల ద్రోహి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ముస్లింల సంక్షేమం కోసం ఒక్క పని చెయ్యలేదని,టిడిపి ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా పూర్తి చెయ్యలేదని ఆరోపించారు. ముస్లింల పక్షపాతి చంద్రబాబునాయుడు మాత్రమే అని ఎన్నికల్లో ముస్లింలు సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

2
1194 views